నేటి గదర్ న్యూస్, భద్రాచలం :
భారీ వర్షాలు కారణంగా గోదావరికి వరద నీరు వచ్చి చేరడంతో
బుధవారం మధ్యాహ్నం 16 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రం ఏడు గంటలకు 18.5 అడుగులకు చేరుకుంది.మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు జలవరుల శాఖ అధికారులు తెలిపారు.
చతిస్గడ్ రాష్ట్రంలోనీ అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం వల్ల తాళిపేరు ప్రాజెక్టుకు భారీ వరద చేరుతున్నది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు కు చెందిన నాలుగు గేట్లు పూర్తిగా,21 గేట్లు రెండు అడుగులు మేర ఎత్తివేయడంతో 68 వేల క్యూసెక్కుల నీరు గోదావరి నదిలోకి వదిలారు. దీంతో భద్రాద్రి వద్ద గోదావరి గురువారం ఉదయానికి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. బుధవారం నాడు భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు పూజలు నిర్వహించి గేట్లు ఎత్తి వేశారు.
Post Views: 88









