నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ ఆన్ లైన్ రాతపరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం 11062 పోస్టులకు 2.79 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నేటి నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రోజుకు రెండు విడతల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు.
Post Views: 84









