+91 95819 05907

ఇస్మార్ట్ శంకర్ కు బిఆర్ఎస్ వార్నింగ్..! అసలు ఏమైందంటే..?

సోషల్ మీడియా వచ్చాకా.. ఎవరి మనోభవాలు దెబ్బతిన్నా అందులోనే కొట్టుకోవడం మొదలుపెట్టారు. సినిమా ట్రైలర్ లో కానీ, సాంగ్ లో కానీ, సినిమాలో కానీ ఏ చిన్న పదం అభ్యంతరకరంగా ఉన్నా కూడా వారి మనోభావాలు దెబ్బతిన్నట్లు తెలుపుతూ వీడియోలు పెడుతున్నారు. తాజాగా కేసీఆర్ డైలాగ్ ను ఒక సినిమా సాంగ్ లో వాడినందుకు బిఆర్ ఎస్ నేతలు మండిపడుతున్నారు.

 

ఉస్తాద్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాను ఛార్మీతో కలిసి పూరీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

ఇక నిన్న.. డబుల్ ఇస్మార్ట్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది. మార్ ముంతా.. చోడ్ చింతా అంటూ సాగిన ఈ సాంగ్ ను మాస్ మసాలా లిరిక్స్ తో ముంచెత్తారు. ఇంకోపక్క కావ్య అందాల ఆరబోత ఒక ఎత్తు అయితే రామ్ స్టెప్స్ మరో ఎత్తు. ఈ సాంగ్ లో కేసీఆర్.. ఒక ఇంటర్వ్యూలో వాడిన ఏం జేద్దామంటావ్ మరి అనే డైలాగ్ ను ఉపయోగించారు. దీంతో బిఆర్ ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు.

 

కల్లు కాంపౌండ్ లో తాగే పాటలో కేసీఆర్ డైలాగ్ ను ఉపయోగించడం ఆయన్ను అవమానించినట్టే అని, కనీసం ఆ లిరిక్స్ కానీ, ఆ హీరోయిన్ బట్టలు కానీ సరిగ్గా లేవని.. వెంటనే ఆ డైలాగ్ ను రిమూవ్ చేయాలనీ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అంటే కేవలం తాగుడు కు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ లా పూరీ చూపించిన విధానం తెలంగాణ ప్రజలను అవమానించినట్టే అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ డైలాగ్ వివాదంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !