+91 95819 05907

ఆందోళన వద్దు.. అందరికి రుణమాఫీ..

ఆగస్టు నెల దాటకుండనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.  సాయంత్రం రూ. 1 లక్షలోపు రుణాలు మాఫీ అవుతాయని, నెలాఖరు వరకు లక్షన్నర రుణాలను మాఫీ చేస్తామని వివరించారు. వచ్చే నెలలో రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ విషయంలో రుణాలు తీసుకున్న రైతులు ఆందోళన చెందవద్దని, అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. రేషన్ కార్డులేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని, ఎవరినీ వదలబోమని, మాట అనే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ రుణమాఫీ కోసం నిద్రలేని రాత్రులు గడిపామని చెప్పారు. రూపాయి రూపాయి కూడబెట్టి రుణమాఫీ చేస్తున్నామని వివరించారు.

 

మిగులు బడ్జెట్‌లో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్ష రూపాయాల రుణమాఫీ కోసం రూ. 25 వేల చొప్పున నాలుగు దఫాలుగా విడుదల చేసి పూర్తి చేసిందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి గుర్తు చేశారు. ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలల వ్యవధిలోనే రూ. 2 లక్షల రుణమాఫీని చేపడుతున్నదని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. అనుకున్న స్థాయిలో ఈ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదని వివరించారు.

 

పార్లమెంటు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే అంతా ఆశ్చర్యపోయారని భట్టి గుర్తు చేశారు. ఓట్ల కోసమే సీఎం హామీలు ఇస్తున్నారని, ఎన్నికల సవాల్ అని అనుకున్నారని తెలిపారు. కానీ, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రూపాయి రూపాయి పోగు చేసి రుణమాఫీని అమలు చేయబోతున్నామని తెలిపారు.

 

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని రైతులకు, ప్రజలకు వివరించి వారి హృదయాలు గెలువాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూతు, ప్రతి ఓటర్ దగ్గరకు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని, తల ఎత్తుకుని ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేయండని చెప్పారు. ఇది కాంగ్రెస్ నేతలు అందరికీ ఉపయోగపడే కార్యక్రమం అని వివరించారు.

 

ప్రజాభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులతో సీఎం, డిప్యూటీ సీఎంలు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. రేపు సాయంత్రం 4 గంటలకు రూ. 1 లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని వివరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !