+91 95819 05907

కాంగ్రెస్ ప్రభుత్వ మహిళలకు ఇచ్చిన హామీలు ఎటు పాయే…?

ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు షేక్. మెహమాద

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన గ్యారంటీ హామీలను వెంటనే నెరవేర్చాలి.

పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న, మద్యం, బెల్టు, షాపులను నివారించి.వాటిని నడుపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.

మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు 25 వందల రూపాయల సహకారం అందించాలి.

500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి.

సరిపడా బస్సులు లేక ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తున్న మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సులను సరిపడ పెంచాలి.

4000 రూపాయల పింఛన్ ఇవ్వాలి.

యువతులకు స్కూటీలు ఇవ్వాలి.

కొత్తగా పెళ్లయిన ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాలి.

చర్ల ఆసుపత్రిలో సరిపడా వైద్య సిబ్బందిని నియమించి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలి.

చర్ల మండల కేంద్రంలోని ఆయిల్ బంక్ ఏరియాలో ప్రగతిశీల మహిళా సంఘం (POW) ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం చర్ల మండలం నాయకురాలు షేక్ మెహమద మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి బెల్ట్ షాపులను బందు జేపిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు ఎక్కడా కూడా ఈ పని అమలు జరగలేదని అన్నారు. చర్ల మండలంలో గుడి బడి గ్రామం అనే ప్రాంతాల భేదం లేకుండా పుట్టగొడుగుల్లా దాదాపుగా గ్రామానికి మూడు బెల్ట్ షాపులు ఉన్నాయని మొత్తం మీద 300కు పైగా బెల్ట్ షాప్ లో ఉంటాయని దీని కారణంగా కుటుంబాలు ఆర్థిక నష్టానికి కలహాలకు గురవుతున్నారని కుటుంబాలు చిందరవందర గందరగోళం అవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బెల్ట్ షాపులు నియంత్రించాలని వాటిని నడుపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి మహిళకు 2500 రూపాయల ఆర్థిక సహకారం ప్రతినెల అందించాలని అన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళల కల్పించడం సంతోషకరమని కానీ సరిపడా బస్సులు లేక ఉచిత ప్రయాణం చేసే మహిళలు తిట్టుకోవడం కొట్లాడుకోవడం వంటి పనులు చేస్తున్నారని అందుకు కారణం సరిపడా బస్సులు లేకపోవడం అని తక్షణమే సరిపడా ఆర్టీసీ బస్సులను నియమించాలని అన్నారు. 4000 రూపాయల పింఛను ఇవ్వాలని అన్నారు.
యువతలకు స్కూటీలు ఇస్తానని హామీ ఇచ్చారని ఆ హామీలు నిలబెట్టుకోవాలని అన్నారు. కొత్తగా పెళ్లయిన వారికి తులం బంగారం ఇస్తానన్నారని దాని వెంటనే అమలు చేయాలని అన్నారు.చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడ వైద్య సిబ్బంది లేరని సరిపడా సిబ్బందిని నియమించి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకురాలులు సరిత ,కృష్ణవేణి, మానస, సమ్మక్క, లక్ష్మి, పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !