+91 95819 05907

ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.

★ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్( ప్రజాపంథా) పినపాక మండల కార్యదర్శి శెట్టిపెళ్లి. నాగేశ్వరరావు.

నేటి గదర్ న్యూస్,పినపాక:
ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్( ప్రజాపంథా) పినపాక మండల కార్యదర్శి శెట్టిపెళ్లి. నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పినపాక తహసిల్దార్ గారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలలో కొత్త రేషన్ కార్డులు, ఇండ్ల మంజూరు, మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇచ్చుట, వృద్ధాప్య పెన్షన్లు నెలకు 4000 వికలాంగుల పెన్షన్లు నెలకు 6000 చెల్లించుట, వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇచ్చుట తదితర హామీలు నేటికీ అమలు చేయలేదన్నారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం వలన ఆరోగ్యశ్రీ లో వైద్య సదుపాయం పొందుట, రైతు రుణమాఫీ పొందడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అన్నారు. ఎంతో మంది పేదలకు సరైన ఇండ్లు, ఇంటి స్థలాలు లేక వర్షాలకు ఇబ్బంది పడుతూ జీవిస్తున్నారు అన్నారు. వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 10 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని, ఇంటి స్థలాలు లేని పేదలకు ఇంటి స్థలాలు చూపించాలని, కొత్త రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని, మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 2500 రూపాయలు చెల్లించాలని, వృద్ధులకు, వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్లు వెంటనే పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వీరనారాయణ చారి, అనసూర్య, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !