+91 95819 05907

చర్ల మండలం లో భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 107 వ జయంతి వేడుకలు.

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్

చర్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 107వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించిన చర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం గా జరుపుకుంటుందని తెలిపారు. దేశంలోని పేద ప్రజల కోసం కానా మకాన్ (భోజనము, ఇల్లు) ప్రతి పేదవారికి అందించిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు. వ్యవసాయ భూములను పేదవారికి పంచిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ దక్కిందన్నారు. బ్యాంకులను జాతీయం చేయడం వలన ప్రజలకు మరింత చేరువ చేశారన్నారు. నెహ్రూ నుంచి అందిపుచ్చుకున్న నాయకత్వ పటిమతో ఉక్కు మహిళగా ఇందిరా గాంధీ దేశ ప్రజలకు మేలు చేసిన ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారని.ఈ సందర్భంగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో డివిజన్ రైతు కాంగ్రెస్ నాయకులు ఇందల బుచ్చిబాబు, చర్ల మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కారంపూడి సాల్మన్ రాజు, తోటమల్ల వరప్రసాద్, ఇర్పాశ్రీనివాసరావు, కణితి శ్రీనివాసరావు,గుడిమెట్ల సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !