నేటి గదర్ చర్ల ప్రతినిధి:వరప్రసాద్
జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూణెం సాయి దొర
వలస గిరిజనేతరులకు ఇంటి పన్నులు మంజూరు చేసిన పంచాయితీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలి…
ఆదివాసి యువత ఉద్యమాల్లో పాల్గొనాలని జిఎస్పి పిలుపు…
వెంకటాపురం మండల వ్యాప్తంగా ఆదివాసీ గ్రామంలో గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలోసుడిగాలి పర్యటన చేశారు, ఈ సందర్భంగా రాచపల్లి గ్రామాల్లో ఆదివాసీ సమస్యల పై సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సమావేశంలో జిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర పాల్గొని ప్రసంగించారు.ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ వలస గిరిజనేతరులు విచ్చల విడిగా వస్తున్నారని, వారిని తక్షణమే మైదాన మైదాన ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,గో బ్యాక్ నాన్ ట్రైబల్ అంటూ సాయి దొర నినాదం ఇచ్చారు.వెంకటాపురం మండలానికి విచ్చలవిడిగా వలస గిరిజనేతరులు వచ్చి 1/70 చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ భూములు దౌర్జన్యంగా ఆక్రమించుకొని,ఏజెన్సీ చట్టానికి విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు,అక్రమ వ్యాపారాలు,చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు .అధికారులు కూడా వారికి వత్తాసు పలుకుతూ వాళ్ళ జీవన విధానానికి తోడ్పడే విధంగా ఏజెన్సీ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని. గిరిజనేతరులు ఇచ్చే మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం తూలుతుందని ఆయన ఆరోపించారు. 1/70,పీసా,చట్టాలను ఉల్లంఘించి గ్రామపంచాయతీ నుండి వలసలు అక్రమంగా ఇంటి పన్నులు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారని, దీనికి కేవలం పంచాయతీ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇలాంటి అధికారులను మైదాన ప్రాంతాలకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.వలస గిరిజనేతరుల ఇంటి పన్నులను రద్దు చేసి వలస గిరిజ నేతరులకు ఇంటి పన్నులు మంజూరు చేస్తున్న పంచాయితీ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అలాగే షెడ్యూల్ ఏరియాలో వలస గిరిజనేతరుల వలన ఆదివాసీలు మైనార్టీలో పడిపోయే ప్రమాదం ఉందని ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చిన గిరిజనేతరుల విద్యుత్ మీటర్లు మరియు రేషన్ కార్డులు మరియు ఆధార్ కార్డులను తక్షణమే రద్దు చేయాలని కోరారు.ఆదివాసి యువకులు ఆదివాసీ చట్టాల కోసం జీవోల కోసం ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని,ముందు ముందు ఆదివాసి మనుగడ కోసం ఉద్యమాలను బలోపేతం చేయాలని,అందుకు యువత ఉద్యమాల్లో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో గ్రామ పెద్దలు ఆదినారాయణ,చంటి చెరుకుల,లక్ష్మయ్య చెరుకుల,చెరుకుల సాయిబాబు,తదితరులు పాల్గొన్నారు.









