రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 19:- మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో మంగళవారం రోజు మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మెట్టు గంగారం ఆధ్వర్యంలో బీసీ కులగణన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణ సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని వాటి వలన ప్రభుత్వం నుండి మంచి ప్రయోజనాలు చాలా ఉంటాయని వారు తెలిపారు.ఈ బీసీ కులగణన రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేసినందుకు మెదక్ జిల్లాలోని బీసీ బిడ్డలందరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మెట్టు గంగారం మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చింతల నర్సింలు. కోశాధికారి సుంకోజు దామోదర్ క్రమశిక్షణ జిల్లా విభాగం అధ్యక్షులు పోచమ్మల గణేష్ రామాయంపేట మండల అధ్యక్షులు ఉమామహేశ్వర్ ధర్మారం అధ్యక్షులు పిట్ల శ్రీశైలంతో పాటు బీసీ సంఘం నాయకులు శివయ్య పల్లి మాజీ తాజా సర్పంచ్ రామకృష్ణ పచ్చంటి రాము పోచమ్మల అశ్విని పల్లె రామచంద్రం గౌడ్ మెదక్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ రజక సంఘం అధ్యక్షులు సంఘ స్వామి కోనాపూర్ యాదగిరి జహీరుద్దీన్ వివిధ జిల్లా సంఘం నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









