ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా
– భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు
కరీంనగర్ జిల్లా : నవంబర్ 21,(హుస్నాబాద్ భార్గవాపురం నియోజకవర్గం /చిగురుమామిడి మండలం ) భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో…..
పట్టభద్రుల, నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని ప్రైవెట్, ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటానని, ఏ రాత్రి ఫోన్ చేసిన ఫోన్ ఎత్తే అలవాటు తనకు ఉందని 24/7 ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ ( బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు అన్నారు. గురువారం చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవెట్ విద్యార సంస్థల్లో బీ ఆర్ ఎస్ ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి గా విసృత ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని చిగురుమామిడి, చిన్న ముల్కనూర్ లో పలువురిని వ్యక్తిగతంగా కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో పట్టభద్రులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.









