నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, జనవరి 07:
హైదరాబాద్ లోని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ కేంద్రంలో రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఎండీ రియాజ్ గారి ఆధ్వర్యంలో జిల్లాల చైర్మన్ల సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ గారు పాల్గొన్నారు. ములుగు జిల్లా గ్రంథాలయాల్లో కావాల్సిన అవసరాలు,సిబ్బంది కొరత గురించి రాష్ట్ర చైర్మన్ గారికి వివరించడం జరిగింది ములుగు జిల్లా గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఉన్నందున అవుట్సోర్సింగ్ విధంగా గాని,ప్రైవేట్ సంస్థ వారి ద్వారా గానీ సిబ్బందిని నియమించాలని వారిని కోరారు
జిల్లాలో వివిధ మండలాల్లో ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి,గాని గ్రంథాలయాలు నిర్వహించడానికి నిధులు లేక ఇబ్బంది పడుతున్నామని ములుగు జిల్లాకి కొంత నిధులు కేటాయించి పాఠకులు ఇబ్బంది లేకుండా వసతులు కల్పించడంలో సహకరించాలని ఈ సమావేశంలో వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ,సెక్రటరి లు అధికారులు పాల్గొన్నారు*









