నేటి గదర్ న్యూస్ జనవరి 07: వైరా ప్రతినిధి
వైరా మండలం రెబ్బవరం గ్రామంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు శాఖా కార్యదర్శుల సమావేశం సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు తూము సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం పాల్గొని మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన బోనసును వెంటనే రైతుల ఖాతాల్లో వేయాలని ఆయన డిమాండ్ చేశారు, జిల్లాలో గన్ని సంచుల కొరత ఉండటం వలన ధాన్యం ఖాటాలు వేయడం ఆలస్యయం అ వుతుందని ధాన్యం ఎండబెట్టు టకు కల్లాల కొరత ఏర్పడిందని అన్నారు. భూమాత ఆర్ ఆర్ ఓ ద్వారా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతు భరోసా డబ్బులు రైతులకు వెంటనే ఖాతాల్లోకి జమ చేయాలని కోరారు. భూమిలేని పేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు, మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇచ్చే ఈ పథకాలను వెంటనే అమలు చేయాలని, ఆరుగారంటల్లోని మిగతా అన్ని పథకాలను వెంటనే అమలు చేయాలని లేనట్లయితే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు షేక్ అబ్దుల్ మజీద్, కారుమంచి జయరావు, అమర్ నేని వెంకటేశ్వరరావు, బాణాల వెంకట్రావమ్మ, శాఖా కార్యదర్శులు తాళ్లూరు నాగేశ్వరరావు, షేక్ మజీద్ బి, దొంతబోయిన గంటమ్మ తదితరులు పాల్గొన్నారు.









