చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
చర్ల మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఊడుగుల సారోని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంగళవారం చర్ల మండల తాసిల్దారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బందెల చంటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా వ్యవసాయ కార్మికులకు భూమిలేని నిరుపేదలకు 12 వేల రూపాయలు ఇస్తానని ప్రకటన చేసింది కానీ
రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పని పూర్తి అయినటువంటి వాళ్లకు మాత్రమే 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి నిరుపేదకు భూమిలేని పేదలకు బడుగు బలహీన ప్రజలకు 12 వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా పారదర్శకంగా ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభలు నిర్వహించి అర్హులైనటువంటి నిరుపేద కార్మికులను గుర్తించి అటువంటి వారికే 12 వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి వాళ్లకు నూతనంగా రేషన్ కార్డులు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం
మండలంలో ఉన్నటువంటి ప్రతినిరుపేదలకు ఈ యొక్క పథకాన్ని అందరికీ అందించాలని లేనియెడల దశలవారీగా వ్యవసాయ కార్మిక సంఘం నుండి కార్యక్రమాలు నిర్వహిస్తామని చర్ల వ్యవసాయకార్మిక సంఘం మండల కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు
సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మచ్చ రామారావు. మండల పార్టీ సభ్యులు కారం నరేష్ పొడుపు గంటి సమ్మక్క మరియు చిప్పనపల్లి నాగేశ్వరరావు సోంపల్లి కృపవరం వంకాయల బాబు ఛత్రపల్లి బాబు గద్దల శ్రీను బుటారి నాగరత్నం. సోయం చిలకమ్మా వరదల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.









