*వరంగల్ జిల్లా*
*07 జనవరి 2025*
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు ఆదేశానుసారం యు.ఎఫ్. డబ్ల్యూ.సి. (పీ.పి యూనిట్) ఎం.జి.ఎం.హాస్పిటల్ ఆశ డే కార్యక్రమానికి హాజరైన డి పి హెచ్ ఎన్ ఓ జ్ఞాన సుందరి.. ఆశ ల పని తీరు పైన రివ్యూ తీసుకుని ,ప్రజలకు అందించవలసిన సేవల గురించి, సాధారణంగా చలికాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలు ముక్కు కారడము, అస్తమ, శ్వాస కోస వ్యాధులు, హార్ట్ ఎటాక్స్ ,చర్మ సంబంధిత వ్యాధులు మొదలగునవి ఎక్కువగా వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్న పిల్లలకు, వృద్ధులకు షెటర్స్, గ్లౌజెస్ ,దుప్పట్లు నిండుగా కప్పుకొని చలికి గురి కాకుండా ఉండాలని కోరినారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని మాతా శిశు సంరక్షణ, ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీలు, వ్యాధి నిరోధక టీకాలు, అందించాలని కోరినారు. ప్రజలు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సూచనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని తెలిపినారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే వెంటనే ఆశ కార్యకర్తలు ద్వారా తగు చికిత్సలు తీసుకోవాలని కోరినారు. అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ఎం.జీ.ఎం.హాస్పిటల్ (పీ.పీ.యూనిట్) అవసరాలకు నిర్మించినారు కాబట్టి సిబ్బంది సమయ పాలన పాటించి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని కోరినారు. కొత్తగా వచ్చిన హెచ్ ఎం పి వి వైరస్ అంతా ప్రమాదకరం కాదని సాధారణ జలుబు ,జ్వరం లాగా వచ్చే లక్షణాలు కలిగి ఉంటుందని కాబట్టి ప్రజలు మాస్కులు ధరించాలని కోరినారు.ఈ కార్యక్రమంలో యు.ఎఫ్. డబ్ల్యు.సి.(పీ.పీ యూనిట్) ఎం.జీ.ఎం. హాస్పిటల్ ఇంచార్జ్ వైద్యాధికారి డాక్టర్ ఎం.యశస్విని, ఎన్.సి.డి సూపర్వైజర్ రేవూరి ప్రకాష్ రెడ్డి, పి.పి. యూనిట్ హాస్పిటల్ సూపర్వైజర్ నర్మద, రామ రాజేష్ ఖన్నా, ఏ.ఎన్.ఎం.లు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..









