★వరుసగా 5 మ్యాచ్ లలో విజయం
★ ప్రధమ బహుమతి రూ,25 వేలు, ట్రోపి కైవసం
దండకారణ్యం ప్రతినిధి,నేటి గదర్ న్యూస్ (బీజాపూర్):
చత్తిష్గుడ్ రాష్ట్రం
బీజాపూర్ జిల్లాలో గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి, వాలీబాల్ పోటీలలో, ఉసూరు మండలం కు చెందిన పూజారి కాంకేర్ టీం ఘన విజయం సాధించింది. వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి, ఫైనల్ కూడా గెలిచి, మొదటి బహుమతి అయినా 25 వేలను సొంతం చేసుకుంది , ఆ టీం లో ఏడుగురు యువకులు, మొదటి మ్యాచ్ ముంజలు కాంకేర్ బి టీం, తర్వాత మ్యాచ్ గంగలూరు టీం, తరువాత భద్రకాళి టీం, తర్వాత ముంజలు కాంకేర్ ఏ టీఎం తో తలపడి మొదటి స్థానంలో నిలిచింది. పూజారికాం కేర్ టీం లో సోడి సుధాకర్, సోడి రామ్మూర్తి, తాటి హరికృష్ణ, తాటి కృష్ణమూర్తి, నవీన్ కుమార్, దేవేందర్ మజ్జి, లింగేశ్వర ముచ్చకి, వీరందరూ వారి యొక్క ప్రతిభను కనబరిచి మొదటి స్థానంలో గెలిచి వారి సత్యాన్ని చాటారు. ఇలాగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, ఉన్న యువతను ప్రోత్సహించి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తున్నారు. వారికి ప్రోత్సహించి ఇంకా మెరుగైన శిక్షణ ఇస్తే ఇంకా ఎన్నో క్షేత్రస్థాయి పోటీలలో పాల్గొని విజయాలను సాధిస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.









