నేటి గదర్ న్యూస్ జనవరి 08: వైరా ప్రతినిధి
వైరా :చిన్ననాటి నుండే విద్యార్థిని విద్యార్థులు కష్టపడే గుణాన్ని ఇతరులకు సహాయం చేసే సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని జీవి మాల్ వారి విశిష్ట ఫౌండేషన్ కోఆర్డినేటర్ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పెనుగొండ ఉపేంద్రరావు అన్నారు. మండలం లోని గన్నవరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చావా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని,విద్యార్థులకు విశిష్ట ఫౌండేషన్ వారి సహకారంతో 30000/- రూపాయల విలువచేసే ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులు తీసుకునే ఆలోచనతో పాటుగా ఇతరుల అవసరాలకు ఉపయోగపడే విధంగా కూడా తయారవ్వాలని తద్వారా భవిష్యత్తుకు సమాజానికి ఉపయోగపడిన వారు అవుతారని ఆయన అన్నారు ప్రధానోపాధ్యాయులు చావ శ్రీనివాసరావు మాట్లాడుతూ దుస్తులు ఇప్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకొని కృషిచేసిన పాఠశాల ఉపాధ్యాయులు పాలపర్తి భాస్కర్ ను అభినందిస్తూ విద్యార్థిని విద్యార్థులు తల్లితండ్రుల యొక్క శ్రమను గుర్తించి వారికి సహాయ పడటంతో పాటుగా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలని లక్ష్యాలను నిర్దేశించుకుని లక్ష్యాలను చేరుకోవాలని తెలియజేసినారు. ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కృష్ణవేణి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో సేవా గుణం కనబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి కొల్లా రాంబాబు, వైరా లయన్స్ క్లబ్ జిఎస్టి కోఆర్డినేటర్ తాడికొండ రాము, పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కృష్ణవేణి, పాఠశాల ఉపాధ్యాయులు డి. రాంబాబు, పాలపర్తి భాస్కర్ చారు గుండ్ల కరుణాకర్. A.కళావతి ఎం.డి రఫీ, విజయ్ కుమార్ sd.ఆసిఫ్ పాషా,p. జయ కుమార్, ఉపాధ్యాయుల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొని విశిష్ట ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసినారు.









