– మల్లన్న దేవుణ్ణి దర్శించుకొని ఎమ్మెల్సీ గా భారీ మెజారిటీ తో గెలువాలని,
– తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహించిన
– భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు
సిద్దిపేట జిల్లా : జనవరి 08,(హుస్నాబాద్ భార్గవాపురం అసెంబ్లీ నియోజకవర్గం / కోహెడ మండలం ) కోహెడ మండల కేంద్రంలో ప్రఖ్యాత శ్రీ మల్లిఖార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, పెద్ద పట్నం వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఇట్టి కళ్యాణ, పెద్ద పట్నం మహోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు పాల్గొని స్వామి వారిని దర్శించుకొని మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా గెలుపొందాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలానే సంకల్పంతో…
ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ…
భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో…..
భారత మాజీ ప్రధాని, భారత రత్న పీ.వీ నరసింహారావు దివ్యఆశీస్సులతో…
పట్టభద్రుల, నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రధాన్యత (1) ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని పట్టభద్రులను, ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో యాదవ చైతన్య వేదిక మండల అధ్యక్షులు పలుమారు సంతోష్ యాదవ్,అంబేద్కర్ సంఘం మండల మాజీ అధ్యక్షులు మంద మల్లేశం, శంకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.









