◆ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి* ,
అశ్వాపురం మండలం, ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో నూతన మెనూ ని పాటించని వార్డెన్లను వెంటనే సస్పెండ్ చెయ్యాలి,ఈరోజు జరిగిన ఏఐఎస్ఎఫ్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి
మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్టల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మెనూ పాటించకుండా వార్డెన్ లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, మెనూ ప్రకారం విద్యార్థులకు కనీసం భోజనం పెట్టకుండా గతం లాగే వ్యవహరిస్తున్నారని కొత్త మెనూ వచ్చిన దాంట్లో కూడా కోతలు విధిస్తూ విద్యార్థులకు నాసిరకమైన భోజనాన్ని అందిస్తున్నారని పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు వార్డెన్లు మాత్రం దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు, జిల్లాస్థాయి అధికారులు హాస్టళ్లపై పర్యవేక్షణ లేకపోవడం వాటిని నియంత్రించకపోవడం ప్రధాన లోపంగా ఉందని అన్నారు, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు, మంచినీళ్లు మరుగుదొడ్లు మూత్రశాలలు, హాస్టల్లో శుభ్రం లేకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యాలకు గురికావడం ప్రధాన కారణాలుగా ఉన్నాయని, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రతి జిల్లా కలెక్టర్ నెలకు ఒకసారి అయినా ఏదో ఒక హాస్టల్లో నిద్రపోవాలని వారి సమస్యలు తెలుసుకోవాలని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా ఇది పూర్తిస్థాయిలో అమలకు నోచుకోవడం లేదని, దీనివల్ల వార్డెన్ల శాఖ జిల్లా బాధ్యులు దీనిపై పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదని రాష్ట్రంలో హాస్టల్లో పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో వాటిని మూసుకోవడం తప్ప వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు,
ఈ కార్యక్రమంలో
ఏఐఎస్ఎఫ్ పినపాక నియోజకవర్గం కార్యదర్శి, అక్కినపల్లి నాగేంద్రబాబు,
ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు, రాజు, సాయి గణేష్, రాజ్ కమల్, మధు, నిఖిల్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు..









