+91 95819 05907

బి ఆర్ ఎస్ పార్టీ వారు తప్పుడు ప్రచారాలు మానుకోండి

◆.ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
దశాబ్ద కాలం అధికారంలో ఉండి ఏ ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వని గత ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులు ఇవాళ గ్రామ సభలలో ప్రజలను రెచ్చగొడుతున్నారు.ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది.
దయచేసి అన్ని గ్రామాల ప్రజలు గ్రామ సభలలో అధికారులు చెప్పే విషయాలను పాటిస్తూ అధికారుల సలహాలు సూచనలు తీసుకోవాలి.
ఆరు గ్యారెంటీలతో ప్రజల కలను నెరవేర్చనున్న ప్రజా ప్రభుత్వం.
కొంత మంది బిఆర్ఎస్ నాయకులు గ్రామసభలలో ప్రజలను రెచ్చగొట్టి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు.
గ్రామ సభలో లేని ఎజెండాలను లేవనెత్తి ప్రజలని అయోమయానికి గురి చేసి గొడవలకు దారి తీస్తున్నారు. అటువంటి వారికి ఖబర్దార్. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.
పది సంవత్సరాలు అధికారంలో ఉండి నియోజకవర్గలలో ఏ ఒక్కరికి కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు. అలాంటి మీరు అధికారం కోల్పోయాక ప్రజల కష్టాల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసము అనేది ప్రజలు గుర్తుచేసుకోవాలి. అమాయక ప్రజలను రెచ్చగొట్టి గ్రామ సభలలో వచ్చే అధికారులను ఇబ్బంది పెట్టి పేద కుటుంబాలకు అన్యాయం చేసే దిశగా ఈ రోజు బిఆర్ఎస్ చేస్తుంది. దయచేసి అన్ని గ్రామాల ప్రజలు గమనించి మీరు ఏ ఏ పథకాలకు అర్హులైనవారో ఆ పథకాలు పొందగలరు. గ్రామ సభలో ఎన్ని ఎజెండాలు ఉన్నాయో అధికారులు క్లుప్తంగా మీకు వివరిస్తారు. మీకున్న సందేహాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోగలరు.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామిని అమలు చేస్తుండడం తో బి ఆర్ ఎస్ నేతలకు కడుపు మంటగా ఉంటుందని అందుకే చిల్లర వేషాలు వేస్తున్నారని సురేష్ నాయక్ ధ్వజమెత్తారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !