+91 95819 05907

అణగారిన వర్గాల గొంతుకగా వినిపించిన మహానుభావుడు గద్దర్.

జాతీయ మాల మహానాడు జిల్లా కన్వీనర్… తోటమల్ల రమణమూర్తి

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్

పేద ప్రజల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కొట్లాడిన మహానుభావుడు ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ అని జాతీయ మాల మహానాడు జిల్లా కన్వీనర్ తోటమల్ల రమణమూర్తి, జిల్లా కో- కన్వీనర్ ఏడెల్లి గణపతి, సీనియర్ నాయకులు తడికల లాలయ్య, కొంగూరు రమణారావు అన్నారు.ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకులు గద్దర్ 77వ జయంతిని పురస్కరించుకొని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, జిల్లా ఇన్ ఛార్జ్ అసోద భాస్కర్ ఆదేశాల మేరకు చర్ల మండల కమిటీ అధ్యక్షులు తోటమల్ల గోపాలరావు అధ్యక్షతన మండల కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కన్వీనర్ తోటమల్ల రమణమూర్తి, కో కన్వీనర్ ఏడెల్లి గణపతి ముందుగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు సీనియర్ నాయకులు తడికల లాలయ్య, కొంగూరు రమణారావులతో కలిసి సమావేశంలో మాట్లాడుతూ గద్దర్ తన ఆటపాటలతో లక్షలాది మందిని మేల్కొల్పిన గొప్ప గాయకుడు అని ప్రశంసించారు.సామాన్యులకు అర్థమయ్యే రీతిలో పాటలు రాసి,పాడి ప్రజలను ఉత్తేజ పరిచే వారిని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు.తెలంగాణ సాంస్కృతిక సమాజానికి ఆయన విశేషమైన సేవలు అందించారని అన్నారు.అణగారిన వర్గాల కోసం కొట్లాడిన మహానుభావుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా అధ్యక్షులు బోళ్ల వినోద్, నాయకులు కారంపూడి సాల్మన్, తోట మల్ల కృష్ణారావు, మోత్కూరి ప్రభాకర్, కొంగూరు సత్యనారాయణ,తోటమల్ల వరప్రసాద్, తోటమల్ల రవికుమార్, కర్రీ సంతోష్, నిట్ట దివాకర్, పాముల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !