◆250 మందికి ఉచిత వైద్య పరీక్షలు
◆1,50,000 విలువగల మందులు ఉచితంగా పంపిణీ
నేటి గద్దర్ వాజేడు ప్రతినిధి
ములుగు జిల్లా ఎటూర్ నాగారం మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరంలో 250 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి,1,50,000 రూ .విలువగల మందులను ఉచితంగా అందించడం జరిగింది,
ఏటూర్ నాగారం పోలీస్ షిరిడి సాయిబాబా దేవాలయం ఏటుర్ నాగారం వారి సౌజన్యంతో .
న్యూ వన్ అపోలో హాస్పిటల్ ఏటూర్ నాగారం దాత్రి ఆర్థోపెడిక్ & సైక్రియాట్రి హాస్పిటల్ వరంగల్ వారి,సహకారంతో ఉచిత ఆర్దో జనరల్ మెగా వైద్య ఉచిత శిబిరం,ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం ను సంయుక్తంగా ఏటూరు నాగారం గ్రామీణ ప్రాంతంలో ఆదివారం షిరిడి సాయిబాబా దేవాలయం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి వైద్య శిబిరం ను స్థానిక పోలీస్ అధికారులు,ఆలయ కమిటీ చైర్మన్, వైద్యాధికారులు ఆలయ సిబ్బంది వైద్య శిబిరం ను ప్రారంభించారు,
పేద మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా ఉన్న మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతం ఏటుర్ నాగారంలో అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి గ్రామీణ ప్రజల కోసం తీసుకురావడం జరిగింది,
ఈ వైద్య శిబిరంలో కార్పొరేట్ ఆసుపత్రిలో లభించే వైద్య పరీక్షలను, అందుబాటులోకి ఉచితంగా తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేయడం జరిగింది,
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య నిపుణులు వైద్యాధికారులు సిబ్బంది గ్రామీణ ప్రాంతాలకు వచ్చి సేవ చేయడం నిజం గా అదృష్టంగా భావిస్తున్నామన్నారు,
విద్య వైద్యం ఆరోగ్యం మొదలైన రంగాలలో ప్రాధాన్యమిచ్చి ఆదర్శ ఆరోగ్యవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం అందరం సంయుక్తంగా కృషి చేయడం జరుగుతుందన్నారు,
ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం స్థానిక ఎస్సై తాజుద్దీన్, షిరిడి సాయిబాబా ఆలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్,
వైద్య నిపుణులు,డాక్టర్ అంబటి అజయ్ కుమార్,
ఎముకలు కీళ్లు వెన్నుముక వైద్య నిపుణులు,
డాక్టర్ నమ్రత దేవులపల్లి
నరములు మానసిక వైద్య నిపుణులు,
డాక్టర్ డి రామారావు ఎంబీబీఎస్, ఎండి, బీపీ షుగర్ అస్తమా జనరల్ వైద్య నిపుణులు,
వైద్యశాల మేనేజర్ అనిల్ రాజు,
సిబ్బంది వెంకటేష్,నికిత, రమేష్,రాకేష్,అంకిత, సృజన్,
మరియు ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.