+91 95819 05907

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న చలో హైదరాబాద్

★కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.

★బడ్జెట్ ను సవరించి తెలంగాణకు అన్ని రంగాలకు నిధులు కేటాయించాలి

★ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగు మహాధర్నా జయప్రదం చేయండి.

భూక్యా వీరభద్రం, మెరుగు సత్యనారాయణ.

నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి

వైరా :కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందని, తెలంగాణకు మొండి చేయి చూపించిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను నిరసిస్తూ బడ్జెట్ సవరించి తెలంగాణకు తగిన స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా వేలాది మందితో జరుగుతుందని, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ కోరారు. మంగళవారం వైరా బోడెపుడి భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం వైరా మండలం కార్యదర్శి తూము సుధాకర్ అధ్యక్షతన జరిగిన ప్రజాసంఘాల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు బడ్జెట్లో నిధులు కోత విధించి పేదలకు పనులు దొరకకుండా చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పరిశ్రమలకు ఎలాంటి నిధులు కేటాయించలేదని విమర్శించారు. విద్యా, వైద్యం ఉపాధిని పూర్తిగా విస్మరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగు మహాధర్నాలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు చింతనిప్పు చలపతిరావు, బాణాల శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం వైరా పట్టణ కార్యదర్శి గుమ్మ నరసింహారావు, షేక్ రెహానా బి, షేక్ మజీద్ బి, యనమద్ది రామకృష్ణ, ఓర్పు సీతారాములు, శివాజీ, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !