+91 95819 05907

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం.!ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్నం చేసిన జాతీయ మాల మహానాడు జిల్లా కన్వీనర్… తోటమల్ల రమణమూర్తి.

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను మూడు గ్రూపులుగా విభజిస్తూ ఉభయ సభల్లో ఆమోదం తెలపడం రాజ్యాంగాన్ని అవమానించడంగానే తాము భావిస్తున్నామని జాతీయ మాల మహానాడు జిల్లా కన్వీనర్ తోటమల్ల రమణమూర్తి, జిల్లా కోకన్వీనర్ ఏడెల్లి గణపతి అన్నారు.ఎస్సీలను మూడు భాగాలుగా విభజిస్తూ జస్టిస్ షమీమ్ ఆక్తర్ ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టి వర్గీకరణ అమలుకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఇచ్చిన పిలుపుమేరకు మాల మహానాడు మండల అధ్యక్షులు తోటమల్ల గోపాలరావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద చర్ల భద్రాచలం ప్రధాన రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మను మాల మహానాడు నాయకులు దహనం చేశారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జిల్లా కన్వీనర్ తోటమల్ల రమణమూర్తి, కో కన్వీనర్ ఏడెల్లి గణపతి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధానంగా చేసుకొని కమిషన్ నియమించడమే కాక, కమిషన్ ఇచ్చిన నివేదికను ఉభయ సభల ద్వారా ఆమోదించడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు.ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంట్ కు మాత్రమే చట్ట సవరణ చేసే అధికారం ఉన్నా అవేమీ పట్టనట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సరైంది కాదని అన్నారు.2011 జనాభా ప్రాతిపదికన మాలలు 6 శాతం ఉంటే 13 సంవత్సరాల అనంతరం 2025 వ సంవత్సరంలో మాలలు ఐదు శాతం ఎలా తగ్గిపోతారని, రోజురోజుకు జనాభా పెరుగుతుంటే మాలల శాతం తగ్గిందంటూ గణాంకాలు తెలపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉభయసభల్లో ఆమోదించిన వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీల రిజర్వేషన్ ను 20 శాతానికి పెంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ బోళ్ల వినోద్, భద్రాచలం డివిజన్ నాయకులు తోటమల్ల కృష్ణారావు, కొంగూరు సత్యనారాయణ,కుప్పాల నిరంజన్, కొంగూరు ప్రదీప్, మంచాల రవీందర్, చింతల శ్రీను, సిద్ధి రమేష్, చింతల నాగేంద్ర, మేడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !