+91 95819 05907

ఎన్నికలలో ఎప్పుడూ వచ్చిన గెలుపు లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త కృషిచేయాలి :రేగా

*ఏడు గ్రామ పంచాయతీల ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షులు రేగా*
నేటి గదర్ కరకగూడెం:ఎన్నికలు,ఎదైన ఎప్పుడూ వచ్చి గెలుపె లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సిద్దంగా ఉండాలని పినపాక మాజీ శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. అనంతారం గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన ఏడు గ్రామ పంచాయతీల ముఖ్య కార్యకర్తలు,నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు తో గద్దెనెక్కి 13మాసలు(నెలలు)నిండిన ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. 6 గ్యారంటీ ల పేరుతో ప్రజలను అనేక అవస్థలు పెడుతున్నారని, రుణమాఫీ రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, దళిత బంధు, పథకాలను అటుకెక్కించి దోపిడి చేస్తున్నారని ఆయన అన్నారు. 420 రోజుల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని దానిని కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని ఏ ఎలక్షన్ వచ్చినా కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలలో అవగాహన కల్పించి రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దివాలా కోరు పార్టీ అని ప్రజలను దివాలా తీయించడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని ఆయన అన్నారు. కార్యకర్తలు సైనికుల పనిచేసే గులాబీ జెండాను రెపరెపలాడించాలని గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల్లోకి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను ప్రజలకు చూపించాలని ఆయన అన్నారు. దేవుళ్ళ మీద ఓట్లు వేసి హామీలు ఇచ్చారు హామీలు పూర్తిగా మర్చిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రజల పక్షాన నిలిచే ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రావుల సోమయ్య,మాజీ సర్పంచ్ ఊకే రామనాథం, విశ్వనాథం సీనియర్ నాయకులు కొమరం రాంబాబు, నాగేశ్వరరావు, మాజీ సర్పంచులు,సీనియర్ నాయకులు అత్తె నాగేశ్వరరావు, పసునురి అంజయ్య,కొమ్మ సత్యనారాయణ, పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !