+91 95819 05907

ఈనెల 16న కొత్తగూడెంలో జరిగే టి యు సి ఐ జిల్లా మహాసభను జయప్రదం చేయండి.

టియుసిఐ జిల్లా అధ్యక్షులు అర్. మధుసూదన్ రెడ్డి. మణుగూరు ఏరియా కార్యదర్శి బి. మల్సూర్

ఈనెల 16న కొత్తగూడెంలో జరిగే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టి యు సి ఐ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి, మణుగూరు ఏరియా కార్యదర్శి బి. మల్సూర్ కార్మికులను కోరారు. ఆదివారం స్థానిక టియుసిఐ కార్యాలయంలో ఏరియా అధ్యక్షులు జెల్ల. అశోక్ అధ్యక్షతన జరిగిన మణుగూరు ఏరియా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మికుల శ్రమను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కంకణం కట్టుకున్నదని, దానిలో భాగంగానే ముందు తరాల కార్మిక వర్గం పోరాడి రక్తతర్పణ చేసి సాధించుకున్న 44 చట్టాలను సవరించి, నాలుగు కోడ్ లుగా విభజించి సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, 8 గంటల పని దినం లాంటి తదితర హక్కులను కాలరాయడానికి పూనుకున్నదని, ఇది కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టకరమైన చర్య అని, కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా, నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై ఉద్యమించవలసిన అవసరం ఉందన్నారు. దేశంలో 44 కోట్ల మంది కార్మికులు ఉంటే జీవన భద్రత కలిగిన సంఘటిత కార్మికులు కేవలం ఐదు కోట్ల మంది మాత్రమే ఉన్నారు అన్నారు. మిగతా కోట్ల మంది కార్మిక వర్గం హక్కులు లేని కనీస వేతనం లేని ఉద్యోగ, సామాజిక భద్రత లేని అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారన్నారు. అసంఘటిత రంగ కార్మికులను ఐక్యం చేసి వారి హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉందన్నారు. టి యు సి ఐ ఆధ్వర్యంలో జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికుల ఐక్యం చేసే కృషి కొనసాగుతుందన్నారు. జిల్లాలో సింగరేణి, మున్సిపల్, విద్యుత్తు, గ్రామపంచాయతీ, మోటార్, హమాలీ, కేజీబీవీ, ప్రభుత్వ హాస్పటల్ వర్కర్స్ తదితర రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం టి యు సి ఐ తమ వంతు బాధ్యతగా పోరాడుతుందన్నారు. ఈ నేపథ్యంలో గత కార్యక్రమాలను, పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యక్రమాలను, పోరాట కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసం ఈ నెల 16న కొత్తగూడెంలో టి యు సి ఐ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని ఈ మహాసభలో మణుగూరు ఏరియాలోని కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఏరియా కమిటీ సభ్యులు బత్తుల. వెంకటేశ్వర్లు, మిట్టపల్లి. రాజేందర్, వి. జానయ్య, ఆర్. బిక్షం, జే. యాకయ్య, ఎం. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !