నేటి గదర్ న్యూస్ ప్రతినిధి, ఖమ్మం:
ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా.సురేష్ నాయక్ ఆధ్వర్యంలో, మోఫి మానసిక వికలాంగుల సమక్షం లో మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబురు.దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మానసిక వికలాంగులతో కలిసి కేక్ కట్ చేసి,పండ్లు పంపిణీ చేశారు.అలాగే వారికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ గారు క్వింటా బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులు తుంబురు.దయాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భూక్యా.సురేష్ నాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు.ప్రద్యుమ్న చారి,ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ నాయుకురాళ్ళు రాయల.కృష్ణ వేణి,సమీరా,సుకన్య, ఎదులాపురం మున్సిపల్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.