నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు…….బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్పై పెరుగుతున్న ఒత్తిడి……పార్టీ ఫిరాయింపులపై ఆధారాలు సమర్పించిన బీఆర్ఎస్…బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, స్పీకర్ రీజనబుల్ టైమ్ అంశంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు…సుప్రీంకోర్టు జోక్యంతో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం …పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985లో స్పీకర్ నిర్ణయాధికారానికి కాలపరిమితి లేకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయని అసెంబ్లీ స్పీకర్…పార్టీ మారి 10 నెలలు అయ్యింది.. ఇది రీజనబుల్ టైం కాదా అని స్పీకర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు…ఫిబ్రవరి 18న తదుపరి విచారణ అయినా రీజనబుల్ టైంపై స్పీకర్ సుప్రీంకోర్టుకు స్పష్టత ఇస్తారా ?గతంలో సుప్రీంకోర్టు జోక్యంతో అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న స్పీకర్లు…తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ను అడిగి నిర్ణయం చెపుతామన్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి …ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్బీఆర్ఎస్లో గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు,గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి..









