నేటి గదర్ న్యూస్, ఫిబ్రవరి 10, ప్రతినిధి
బోనకల్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో జరిగిన న్యాయ చైతన్య అవగాహన సదస్సులో మధిర జూనియర్ సివిల్ జడ్జి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ బాలికలకు పొక్సో చట్టం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి టెన్త్,ఇంటర్ క్లాస్ పిల్లలకు వివరించారు.పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలన్నారు.మంచిగా కష్టపడి,ఇష్టంతో చదవాలన్నారు.పిల్లలకు ఎలా చదవాలి లాలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ గురించి తెలియజేశారు.పాఠశాల సిబ్బందిని అభినందించారు.అనంతరం వంట గది, డైనింగ్ హాల్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సభ్యులు కోట వెంకట్,కన్నెపోగు వెంకటేశ్వర్లు (కే.వీ.ఆర్),ప్రిన్సిపాల్ పద్మావతి,కోర్టు సిబ్బంది వెంకన్న, మల్లేశం,ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 67