+91 95819 05907

తెలంగాణలో పీఎంఏవై -జీ వివరాలేంటి ?

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
* లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి
* గత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో.. సర్వే నిలిచిందని.. పేదల కోసం ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని.. తదుపరి ప్రక్రియ చేపడతామని సమాధానమిచ్చిన కేంద్రమంత్రి

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ( పీఎంఏవై -జీ ) పై కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలు ఏమిటని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి.. లోక్ సభలో మంగళవారం ప్రశ్నించారు. గత మూడేళ్లలో కేటాయించిన నిధుల వివరాలను అడిగారు. దీనికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (పీఎంఏవై -జీ ) పథకం ద్వారా 2016 -17, – 18 ఆర్థిక సంవత్సరాల్లో 70,674 గృహాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తొలి విడతలో రూ.190. 79 కోట్లను కేటాయించినట్లు చెప్పారు.
* గత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయలేదని, దీంతో ఆ ప్రభుత్వానికి నిధుల కేటాయింపు నిలిపివేసినట్లు తెలిపారు.
* ఆ ప్రభుత్వం.. 2018-19 వరకు సర్వేను కూడా నిర్వహించలేనందున.. అర్హులైన కుటుంబాలను గుర్తించలేకపోయారని చెప్పారు.
* ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో పీఎంఏవై -జీ అమలుకు సముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. అందుకే..అర్హులైన పేదలకు లబ్ధి కలిగేలా.. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉంటుందని.. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి వివరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులుగా బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి నియామకం

పినపాక మండలం ఈ. బయ్యారం గ్రామానికి చెందిన తెలంగాణ జన సమితి పార్టీ మండల నాయకులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి గారిని పినపాక మండల నూతన తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షుడిగా

Read More »

హొలీ సందర్భంగా హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ సూచన ఇదే

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: రంగుల ఖేలి హోళి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. హోలీ పండుగ సందర్భంగా పేర్కొన్న నిషేధాలు అమలులో ఉంటాయన్నారు. 2025 మార్చి

Read More »

రక్త దాన శిబిరం విజయవంతం

*శ్రీరామ ఆగ్రో సర్వీసెస్ వారు మెగా సర్వీస్ క్యాంప్ తో పాటు భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ వారితో రక్త దాన శిబిరం విజయవంతం* భద్రాద్రి కొత్తగూడెం

Read More »

ఆత్కూరు నుండి మధిర, బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

నేటి గదర్ న్యూస్, మార్చి 12 మధిర నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రివర్యులు

Read More »

మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్… అక్రమ అరెస్టు పట్ల మండిపడ్డ ప్రతిపక్షాలు, సీనియర్ జర్నలిస్టులు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మహిళా జర్నలిస్ట్ రేవతిని సిసిఎస్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ రేవతి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Read More »

 Don't Miss this News !