నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి,
ఖమ్మం : ఫిబ్రవరి 9 హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 4th ఇంటర్నేషనల్ ఓపెన్ టూ ఆల్ స్టైల్స్ కరాటే & కుంగ్ ఫు ఛాంపియన్షిప్ – 2025 అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్ న్యూ డ్రాగన్ ఫైటర్స్ మార్టియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది . ఈ టోర్నమెంట్ను ‘న్యూ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్’ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు పీవీ శ్రీ రాములు నిర్వహించారు . నేపాల్ , భూటాన్ , శ్రీలంకతో పాటు తమిళనాడు , మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్ర నుండి 3000 మంది విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు . ఈ టోర్నమెంట్లో ఖమ్మం జిల్లా సీనియర్ కరాటే మాస్టర్ కరాటే వేణు ఘన విజయం సాధించారు . మరియు తన కుమారుడు మోదుగు అభిషేక్ ఈ కరాటే టోర్నమెంట్ లో పాల్గొని బంగారు పతకం గెలుచుకున్నారు . మీ విజయాలు ఖమ్మం జిల్లాకి గర్వకారణం అని పలువురు కొనియాడారు . కరాటే మాస్టర్ కరాటే వేణు సీనియర్ బ్లాక్ బెల్ట్ కుమిటే విభాగంలో ప్రధమ బహుమతి గోల్డ్ సర్టిఫికెట్ , ఛాంపియన్షిప్ – 2025 ను దక్కించుకుని సినీ నటు భానుచందర్ తదితరు చేదు మీదుగా అందుకున్నారు .









