నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్ 1: మండల పరిధిలోని వినాయకపురం గ్రామ శివారులో వేంచేసి ఉన్న శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో జాతర నేపధ్యంలో మార్చి 5న వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఇ ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయం లో జాతర మహోత్సవం పురస్కరించుకొని ది26.03.2025 నుండి 01.04.2025 వరకూ ఏడు రోజుల పాటు దుకాణాలు నిర్వహించుకునేందుకు ఈవేలం పాట జరుగుతుందని తెలిపారు. జాతరలో లడ్డు పులిహార అమ్ముకొనుటకు, కొబ్బరి కాయలు పూజా సామగ్రి అమ్ముకొనుటకు, ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ అమ్ముకొనుటకు గాను దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాలు మేరకు వారి సమక్షంలో మార్చి 5 బుధవారం మద్యాహ్నం 12.30 నుండి ఆలయ ఆవరణలో వేలం పాట జరుగుతుందని ఆసక్తిగలవారు దరావత్ సొమ్ము చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని ఇఓ కోరారు.
Post Views: 206









