వందల సంఖ్యలో భక్తులు హాజరు.
మెదక్ జిల్లా న్యూస్ నేటి గదర్ (భూపాల్ ) మార్చ్ 9.
మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రము పరిధిలోని కిష్టాపూర్ గ్రామ శివారులో దర్గా దగ్గర నెలపాత్య లక్ష్మప్ప అప్ప ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో వందల సంఖ్యలో పాల్గొని వివిధ గ్రామాల నుంచి పక్క జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో రావడం ఆనవైతిగా జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన భక్తులకు భోజనాలు ఏర్పాట్లు ప్రతినెల ఏర్పాటు చేస్తామని లక్ష్మప్ప చెప్పారు. అనంతరం ఈ సందర్భంగా ప్రతినెల దశమి రోజు లక్ష్మప్ప, మాట్లాడుతూ ప్రేమ సంతోషం అందరి హృదయాల్లో ఎలాంటి కల్మషం లేకుండా బ్రతకాలని ఓదార్పుతో సహనంతో ఉండాలని మన ఆత్మననే దేవుడు అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా బ్రతకాలని ఒకరికొకరు ప్రేమించుకుని ప్రేమ పూర్వకంగా జీవించాలని భక్తులకు సూచించారు. అనంతరం ఇతర గ్రామాల నుండి భక్తులు చాలా రావడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భజన భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు.