రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 16:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన ఓద్ది రవీందర్ (48) చిన్ననాటి నుండి ఎస్సీ కాలనీలో ఉన్న గ్రీన్ క్రేష్ లో అంకిడి సంపత్ కుమార్ గురువుల వద్ద ఆయన విద్యాభ్యాసం చేశాడు.అక్కడ నుండి ఇతడు రామాయంపేట పట్టణంలో 1992-93 ఎస్ఎస్సి బ్యాచ్ వరకు చదువుకున్నాడు.తర్వాత ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేసుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి హైదరాబాదులో స్థిరపడ్డాడు.తన అంగవైకల్యాన్ని అధిగమించి తన భార్య ఇద్దరు పిల్లలతో కుటుంబంలో సంతోషంగా జీవిస్తున్నాడు.ఈ తరుణంలో ఓద్ది రవీందర్ కు ఇటీవల కిడ్నీ ఆపరేషన్ జరిగి మూడు నెలలు అవుతుంది.అనుకోకుండా శనివారం రోజు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు.ఆయన అక్కడ చికిత్స పొందుతూ రాత్రి సమయంలో మృతిచెందారు.అతడు చిన్న వయస్సులో బ్రెయిన్ స్ట్రోక్ తో మృతిచెందడంతో ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.స్వగ్రామమైన రామాయంపేట పట్టణంలో ఆదివారం రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబీకులు తెలిపారు.మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.









