+91 95819 05907

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బిఆర్ఎస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు

◆ఉమ్మడి చేగుంట నార్సింగ్ మండల కేంద్రాలలో బిఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మార్చి 16.

తెలంగాణ లో దళితులను గౌరవించని పార్టీ బిఆర్ఎస్. అని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
దళిత స్పీకర్ ని అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని శాసనసభకు హాజరుకాని కేసీఆర్
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా శాసనసభ్యుడు గుంతకల్ల జగదీశ్ రెడ్డి మరియు కేటీఆర్ దిష్టిబొమ్మలను చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ శాసనసభలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకల్ల జగదీశ్ రెడ్డి, ఏకవచనంతో మాట్లాడుతూ ఆగౌరవపరిచి, శాసనసభ సంప్రదాయాలను తుంగలో తొక్కినందుకు, జగదీష్ రెడ్డికి మద్దతుగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశామని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ మొదటి నుండి దళిత వ్యతిరేక పార్టీ అని తెలిపారు. ఉద్యమ సమయంలో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేసి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తా అని చెప్పి మోసం చేసింది కెసిఆర్ ని తెలిపారు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్య ని అకారణంగా మంత్రివర్గం నుంచి తొలగించి దళితుల మీద ఉన్న అక్కసును చూపింది బిఆర్ఎస్ పార్టీ అని తెలిపారు.దళితుడైన గడ్డం ప్రసాద్ శాసనసభ స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ నియమిస్తే అధ్యక్షా అని సంబోధించాల్సి వస్తుందని కెసిఆర్ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదని తెలిపారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గుంతకల్ల జగదీశ్ రెడ్డి ని అసెంబ్లీ నుండి బహిష్కరించడమే కాకుండా అతని యొక్క సభ్యత్యాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మెదక్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగాల గోవర్ధన్, రాజేష్, ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్ ఎస్టి సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్ ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, ఉపాధ్యక్షులు మద్దూరి రాజు ,యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ ,దుబ్బాక అసెంబ్లీ యువజన కార్యదర్శి సాయి కుమార్ గౌడ్, జిల్లా మహిళా నాయకురాలు కురుమ లక్ష్మి, సొమ్ల తండ భద్య నాయక్, రాకేష్ ,రవీందర్ నాయక్ ,గణ్య నాయక్ ,భాషా ,రాజు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !