మానవత్వo చాటుకున్న కొమరం వారి ఇలవేల్పు శ్రీ రెక్కల రామక్క ట్రస్ట్ బోర్డ్- పెద్దూరు గ్రామం
*మేమున్నామని చేయూతనిచ్చారు.
ఈ పాప పేరు *కొమరం లాస్య శ్రీ* వయసు 9 సంవత్సరాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం. ఏడూళ్ళ బయ్యారం. బొమ్మరాజు పల్లి గ్రామం
తండ్రి- కొమరం బాలకృష్ణ
తల్లి- కొమరం లలిత
అక్క- జోష్ణ శ్రీ
పినపాక మండలం, బొమ్మరాజు పల్లి గ్రామానికి చెందిన కొమరం లాస్య శ్రీ తల్లిగారు కొమరం లలిత గారు అనారోగ్యo కారణంగా 5 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. 1 సంవత్సరం తరువాత కొమరం జోష్ణ శ్రీ గారు 10 వ తరగతి చదువుతుండగా అనారోగ్యం కారణంగా కొమరం జోష్ణ శ్రీ గారు చనిపోవడం జరిగింది.
06-03-2025 గురువారం కొమరం లాస్య శ్రీ గారి తండ్రిగారైన కొమరం బాలకృష్ణ గారు అనారోగ్యo కారణంగా మరణించడం జరిగింది. ఇలా ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలో వెంట వెంటనే మరణించడం జరిగిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కొమరం వంశీయులు మానవతా దృక్పథంతో స్పందించి *ఆర్థిక సహాయం.రూ.26.500/- కొమరం వారి ఇలవేల్పు శ్రీ రెక్కల రామక్క ట్రస్ట్ బోర్డు ద్వారా అందించారు* ఈ పాపకు భవిష్యత్తులో విద్యకు సంబంధించిన ఖర్చులు కూడా *రెక్కల రామక్క ట్రస్ట్ బోర్డు* ద్వారా అందిస్తామని తెలియజేయడం జరిగింది
*ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు*
*కొమరం రామ్మూర్తి గారు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్. కొమరం. లక్ష్మణరావు AEO.గారు కొమరం నర్సయ్య గారు టీచర్ కొమరం. సారయ్య గారు ఎక్స్ ఎంపీటీసీ కొమరం బాలయ్య గారు కొమరం రాంబాబు గారు ఎక్స్ ఎంపీపీ కొమరం స్వామి గారు కొమరం ప్రభాకర్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది.
కాగా ఆదివాసి చిన్నారికి తోచిన మేర దాతలు ఆర్థిక సాయం అందిస్తూ కొంతమేరకు అండగా ఉంటున్నారు. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు స్పందించి అనాధగా మారిన ఆ చిన్నారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదివాసి సంఘాల నాయకులు కోరుతున్నారు.









