జవహర్ లాల్ కు పలువురి ఘన నివాళి
ఖమ్మం మార్చి 16 : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మేడ్చల్ జిల్లా పోలీస్ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ , డిఎస్పి , వైరా మాజీ ఎమ్మెల్యే సోదరుడు జవహర్ లాల్ కర్మ , సంతాప సభ లో పాల్గొన్న పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం చిన్న ఈర్లపూడి గ్రామంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సమక్షంలో జరిగిన కర్మ , సంతాప సభ లో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ , వీరనరీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి , ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రవీంద్ర నాయక్ లు పాల్గొని , ఘనంగా నివాళులు అర్పించారు. కొద్దిసేపు జవహర్ లాల్ చిత్రపటం ఎదుట శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన సేవలను కొనియాడారు. మృతుడు జవహర్ లాల్ సోదరులు వైరా మాజీ శాసనసభ్యులు మదన్ లాల్ , ఎఫ్ సి ఐ మేనేజర్ సుందర్ లాల్ , కుటుంబ సభ్యులకు సంతాపం , సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి స్పందన, మీడియా ఇన్ఛార్జి త్రివేణి ,జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి ,ఉపాధ్యక్షురాలు విజయ, గౌరవ సలహాదారులు కే .లక్ష్మి ,పి .జ్యోతి లు పాల్గొని ,నివాళులు అర్పించారు.









