ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులుగా సీనియర్ న్యాయవాదులు మందడపు శ్రీనివాసరావు, పి. సంధ్యారాణి మరియు సామాజిక కార్యకర్త డాక్టర్ డి పూర్ణ చంద్ర రావు లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయ సేవాధికరణల చట్టం ప్రకారం జిల్లా న్యాయ సేవ సంస్థ అధ్యక్షులుగా జిల్లా జడ్జి ఉండగా జిల్లా కలెక్టర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ప్రభుత్వ న్యాయవాదులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. వీరితోపాటు ప్రముఖ సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది మరియు న్యాయ సేవా సంస్థల కార్యకలాపాలపై ఆసక్తి ఉన్న ప్రముఖులను సభ్యులుగా నియమిస్తారు. ఈ కేటగిరీలలోని ప్రస్తుతం సభ్యులను రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరు రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశాలలో వీరు జిల్లా జడ్జి, కలెక్టర్ ఎస్పీ లతోపాటు సభ్యులుగా పాల్గొంటారు.









