నేటి గదర్ మెదక్ ప్రతినిధి (భూపాల్) మార్చి 17.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను నమ్మించి మోసం చేస్తుందని సోమవారం నుండి నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటదన్నారు. వర్గీకరణపై ఇచ్చిన మాటను అమలు చేస్తానని మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి ఆనాడు అసెంబ్లీలో అవసరమైతే గ్రూప్ వన్ గ్రూప్ టు గ్రూప్ 3 పరీక్షల్లో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను అమలు చేస్తామని సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కాని మాదిగలను నమ్మించి మోసం చేస్తున్న ముఖ్యమంత్రి ఏబిసిడి కాకుండా ఏబిసి గా ఎందుకు విభజించారు. మాదిగ మాదిగ ఉపకులాలకు తెలిపాల్సిన విషయం ఉందని మందకృష్ణ మాదిగ అన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంగా ఎమ్మార్పీఎస్ మరియు ఉప కులాల నాయకులకు న్యాయం చేయాలని కోరారు. మాసాయిపేట మండల కేంద్రంలో చేపట్టిన నిరాహార దీక్షలను మెదక్ జిల్లా జర్నలిస్ట్ ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మాసాయిపేట భూపాల్ మాదిగ ప్రారంభించగా మాసాయిపేట మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మొగిలిగుండ్ల ప్రభాకర్ మాదిగ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభం అయ్యాయి. ఈకార్యక్రమంలో మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు పరమేష్, ఎమ్మెస్ ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి వినోద్ మాదిగ, మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి చిన్నోళ్ల భాస్కర్ మాదిగ, అచ్చంపేట గ్రామ అధ్యక్షులు బోడ వేణు మాదిగ, పోతనపల్లి గ్రామ అధ్యక్షులు మహేష్ మాదిగ, చెట్ల తిమ్మయ్య పల్లి గ్రామ అధ్యక్షులు బాబు మాదిగ, అక్కింపేట మొగిలిగుండ్ల శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు, నాగరాజు మాదిగ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.









