+91 95819 05907

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేసిన సన్ రైజ్ సంస్థ.

నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి17:-ఈరోజు కొణిజర్ల మండలం పెద్ద గోపతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు సుమన్ బాబు సోదరి కట్టా జ్యోత్స్న పుట్టిన రోజు సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు మార్క్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేయటం అభినందనీయం అని, సంస్థ సభ్యులు తాము కష్టపడి సంపాదించిన దానిలో కొంత భాగాన్ని ఇలా సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చించడం మంచి ఆలోచన అని తెలిపారు. తల్లాడ ఎంపీడీవో ఏనుగు సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు పరీక్ష లకు మంచిగా సిద్దమౌవ్వాలని మంచి ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలి అని తెలిపారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు సుమన్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి తాము చదివిన పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు ఏనుగు శివ రాఘవ,ప్రతినిధులు యంపీ దాస్, షేక్ సుభాని, శోభన్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !