*విద్యార్థులందరూ 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్పులు సాధించాలి*
*క్రమశిక్షణతో ముందుకు వెళ్తూ పై చదువులను చదివి ఉన్నత శిఖరాలలో ఉండాలి!*
*మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్*
నేటి గదర్ న్యూస్, మార్చి 17 , మధిర
ప్రతి ఒక్క విద్యార్థికి ,ఉపాధ్యాయులకు వీడ్కోలు అనేది సహజం *మధిర* *మండల దెందుకూరు జిల్లా* పరిషత్ బాలుర, బాలికల, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు. *మండల విద్యాశాఖ అధికారివై*ప్రభాకర్* ముఖ్యఅతిథిగా పాల్గొని 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని తోటి ఉపాధ్యాయులతో కలిసి సోమవారం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ వారు మాట్లాడుతూ, వీడ్కోలు అనేది ప్రతి ఒక్కరికి వస్తుందని విద్యార్థులందరూ 10వ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించి మీ తల్లిదండ్రులకు మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు మన పాఠశాలలకు మంచి పేరు ప్రఖ్యాతాలను తీసుకురావాలనివారు విద్యార్థులకు సూచించారు. అలాగే రేపటి పై చదువులకు వెళ్లాలంటే మీరు రాసే పదవ తరగతి పరీక్షల్లో వచ్చే మార్పులే అవసరం పడతాయని, అందుకు ప్రతి ఒక్క విద్యార్థి పరీక్షల్లో అధిక మార్కులను సాధించాలని మంచి మార్కులు వస్తే కాలేజీలో ఫ్రీ సీట్లు వస్తాయని, పరీక్షలకు సమయం దగ్గర పడుతున్నందున సమయాన్ని వృధా చేయకుండా క్రమశిక్షణతో కూడిన చదువును చదువుకొని పరీక్షలు రాసి మీ పాఠశాలకు మీ , గ్రామానికి మీ తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని తన ప్రసంగం ద్వారా తెలిపారు. అలాగే పాఠశాలవిద్యార్థులు స్టేజిలపై ఆటపాటలతో పాఠశాల తోటి విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అబ్బురపరిచారు. ఈ సందర్భంగా వీడ్కోలు పొందుతున్న పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు మాట్లాడుతూ, మా ఉపాధ్యాయులను మా పాఠశాలను వదిలి వెళ్లాల్సి వస్తుందని మేము అనుకోలేదని, మా ఉపాధ్యాయులు మాకు విద్యను బోధించడం కోసం ఎంతో కృషి చేశారని మేము అల్లరి చేసిన వాళ్లు భరించి మమ్మల్ని వాళ్ళ పిల్లల మాదిరిగా చూశారని అందుకు మా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నామని, అలాగే పరీక్షల్లో మంచి మార్కులు సాధించి పై చదువుల్లో మంచిగా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటామని అన్నారు. మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ వారు మాట్లాడుతూ, పిల్లలు పాఠశాలను వదిలి వెళ్తున్నారంటే తమకు కూడా చాలా బాధగా ఉందని ఎక్కడ ఉన్నా మా సొంత పిల్లలా మేము భావిస్తామని వాళ్లు మంచి స్థానంలో ఉన్న రోజే మేము చాలా ఆనందపడతామని వీడ్కోలు పొందుతున్న వాళ్ల పిల్లల్ని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మువ్వ వెంకటేశ్వరరావుఉపాధ్యాయ బృందం అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గుగ్గిళ్ళ కామేశ్వరి. విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.









