+91 95819 05907

మే 20న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి:అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు.

మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు వి. జాన్,(INTUC), జి. వెంకటేశ్వర్లు (AITUC), రమేష్ బాబు(HMS), జి. శ్రీనివాస్(CITU), ఆర్. మధుసూదన్ రెడ్డి(TUCI), మంగీలాల్(IFTU),నాగెల్లి. వెంకట్,(TBGKS), ఎం. నాగేశ్వరావు(TNTU), వి. సమ్మయ్య,(CKHPS) కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మంగళవారం అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం మణుగూరు సిపిఐ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, తదితర డిమాండ్ల సాధన కోసం జాతీయ కార్మిక సంఘాల తో పాటు, రాష్ట్ర కార్మిక సంఘాలు, వివిధ సంస్థలు, ఫెడరేషన్లు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, ఈ సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేశంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి, కార్మికుల శ్రమను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కంకణం కట్టుకున్నది అన్నారు. దానిలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందని, ముందు తరాల కార్మిక వర్గం పోరాడి రక్త తర్పణ చేసి హక్కులు, చట్టాలు సాధిస్తే, నేడు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మిక హక్కులను కాలరాయడానికి పూనుకున్నది అన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ, డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర సరుకుల తదితర ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారాలు మోపుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టవలసిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందన్నారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పుకొట్టాలి అన్నారు.
ఈ సమావేశంలో రాయల. బిక్షం, P. భద్రం, U. నరసింహారావు, జక్కుల. రాజబాబు, బత్తుల. వెంకటేశ్వర్లు, S. వీరమల్లు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

 Don't Miss this News !