నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ పండుగను ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాదిమంది వీక్షిస్తున్నారు. ఈ దఫా ఐపీఎల్ ఎన్నో రికార్డులకి వేదికగా నిలిచింది.కాగా నేడు ఢిల్లీ వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న మ్యాచ్ పై సామాజిక మాధ్యమాలతో పాటు, టీవీలలో, క్రికెట్ క్రీడ అభిమానులలో జూనియర్ వర్సెస్ సీనియర్ అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతుంది. వారే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఎంఎస్ ధోని కి 44 సంవత్సరాలు కాగా రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన అతి పిన్న వయసుకుడు వైభవ్ సూర్య వంశీ 14 ఇద్దరు మ్యాచ్ ఆడుతుండడమే ఇందుకు కారణం. వైభవ్ కి ఏమాత్రం అవకాశం దొరికిన తాను ఎదుర్కొనే బంతులను అవలీలగా స్టాండ్ లోకి నెట్టేస్తున్నాడు. మరోవైపు సీనియర్ ప్లేయర్ ఎంఎస్ ధోని హెలికాప్టర్ షాట్స్ గురించి తెలియంది కాదు. జూనియర్ వర్సెస్ సీనియర్ యంగ్ స్టార్ ఈ ఇద్దరిలో ఎవరు పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి అంటే ఈరోజు సాయంత్రం 6:30 నిమిషాల కు ప్రారంభం కానున్న మ్యాచ్ చూడాల్సిందే. కాగా రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించాయి
చివరి స్థానాలలో మెరుగైన స్థానం కోసం ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్ లకు 3 గెలవగా, సీఎస్కే 12 మ్యాచ్ లకు 3 మ్యాచులు గెలిచింది.









