+91 95819 05907

వలస ఆదివాసీ గూడెలలో మౌలిక వసతులు కల్పించాలి:తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్

★వలస ఆదివాసీలను పట్టించు కోని మంత్రి సీతక్క

★తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం

వలస ఆదివాసి గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి, రాష్ట్ర కమిటీ సభ్యులు జజ్జరి దామోదర్ లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న వలస ఆదివాసి గ్రామాలలో, ఆదివాసులు బ్రతకటానికి అవసరమైన మౌలిక వసతులు (త్రాగునీరు,కరెంటు రోడ్లు, విద్య, వైద్యం) లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.తనను గెలిపిస్తే ఆదివాసీ గూడెలలో అన్ని వసతులు కల్పిస్థానని మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకొని, గెలిచి అధికారంలోకి వచ్చి మంత్రి అయిన తర్వాత వారిని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఆదివాసీలను రాజకీయ పార్టీలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నాయి, తప్ప వారిని కనీసం మనుషులుగా పరిగణించటం లేదని విమర్శించారు. ఏజెన్సీ చట్టాల పరిధిలో ఆదివాసీల హక్కులకు రక్షణ కల్పిస్తూ, వారికి కనీస మౌలిక వసతులు కల్పించి, వారిని ఆదుకోవాలని కోరుతూ పిఓ గారిని కోరారు. ఈ కార్యక్రమం లో సోడి అర్జున్, అదిబాబు, దేవా,జోగయ్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46

Read More »

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

 Don't Miss this News !