◆రఘునాథపాలెం మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి.
దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేసిన దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి.దేశమంతా పాదయాత్ర చేసి కులగణన కు ఆలోచన చేసిన నాయకుడు రాహుల్ గాంధీ.ఎస్సీ వర్గీకరణ చేసి మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం.మన్మోహన్ సింగ్ పాలనలో దేశమంతా 70 వేల కోట్లు రుణమాఫీ చేస్తే తెలంగాణ లో 21 వేల కోట్లు రుణమాఫీ చేశాం.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా రైతు భరోసా విషయంలో వెనుకడుగు వేయం.రైతు సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయం.ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేయాలి.ఇతర జిల్లాల వారు ఖమ్మం లో నివసించాలనే ఆలోచనలు వచ్చేలా ఖమ్మం నగరాభివృద్ధి.అధికార పార్టీ వారు సర్పంచ్ లు.. ఎం పి టీ.సీ జడ్పీ.టీ.సీ లుగా ఎన్నికైతే ప్రజలకు చేరువ కావొచ్చు.గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేయడం నా రాజకీయ లక్ష్యం.పనిచేసే కార్యకర్తలకు పార్టీ పదవుల్లో పెద్దపీట.స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి.ప్రజాభిమానం ఉంటే పదవులు అవే దక్కుతాయి అని తుమ్మల అన్నారు.









