రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూన్ 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన టంకరి రాము (34) అనే యువకుడు సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబ సభ్యులతో జీవనం కొనసాగిస్తున్నాడు.ఈ తరుణంలో గత రెండు నెలల క్రితం వేసవికాలం సెలవులలో అతని అక్క ఇక్కడికి రావడం జరిగింది.ఆమెకు బొంబాయి వెళ్లడానికి సరైన రూటు తెలువకపోవడంతో గత సోమవారం రోజు తిరుగు ప్రయాణంలో బొంబాయిలో అక్కను వదలి వెళ్లడానికి స్వగ్రామం నుండి రాము బయలుదేరి వెళ్లాడు.అక్కడ ముంబై సముద్రంలో అక్క కుటుంబ సభ్యులతో కలిసి బోటు ప్రయాణం చేసి ఒడ్డుకు వచ్చి చెప్పులు తీసుకొని దిగుతుండగా ప్రమాదవశాత్తు సముద్రపు అలలు ఒక్కసారిగా రావడంతో క్రిందపడి కొట్టుకొనిపోయి మృతి చెందాడు.కొద్ది నిమిషాల ముందే అక్క కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన యువకుడు మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లి భార్య పిల్లలు ఒక్కసారిగా బోరుమని విలపించడంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మృతునికి అశ్విత అన్విత అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.ఆ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.









