నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డికి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
పాల్గొనగా శనివారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ,వికలాంగులు పాలాభిషేకం నిర్వహించారు.వికలాంగులను,వికలాంగులు వివాహం చేసుకుంటే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం జీఓ ఇచ్చిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తు రేవంత్ రెడ్డి ఫొటో కు పాలభిషేకం చేసిన వికలాంగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య లు మాట్లాడుతూ దివ్యాంగులకు అన్ని విధాల ప్రజ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు.
Post Views: 198









