నేటి గదర్ న్యూస్,పినపాక(మణుగూరు):పిడుగుపాటుకు గిరిజన రైతు మృతి చెందిన సంఘటన మణుగూరు మండలం లో శనివారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.రేగుల గండి
కుంజ జగన్(40) పిడుగుపాటుతో చనిపోయాడు. మణుగూరు మండలం రేగుల గండి గ్రామానికి చెందిన జగన్ పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి. మృతుడికి భార్య పేరు దేవి, నలుగురు పిల్లలు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, ఆదివాసి సంఘాల నాయకులు కోరారు.
Post Views: 200









