*జూన్ 17న చలో హైదరాబాద్ మహా ధర్నాను జయప్రదం చేయండి.*
*అఖిలపక్షం ఆధ్వర్యంలో గుండాల మండల కేంద్రంలలో పోస్టర్ ఆవిష్కరణ*
*ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నక్స నిజాన్ని అణచివేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ అడవుల్లోని ఖనిజ నిక్షేపాలను,వనరులను కార్పొరేట్లకు కట్టబెట్ట చూసే ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలని శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో జూన్ 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టు పార్టీతో వెంటనే శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.జూన్ 17న హైదరాబాదులో జరిగే మహాధర్నాకు ప్రజలు అధిక సంఖ్యలో కదిలి రావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ నాయకులు జిల్లా నాయకులు కొమరం సీతారాములు, అరెం నరేష్, పర్శక రవి, వజ్జ ఎర్రయ్య, సిపిఐ నాయకులు వాగబోయిన రమేష్, గడ్డం శ్రీను,కాంగ్రెస్ నాయకులు ఈసం పాపారావు, అబ్దుల్ నబీ, టిఆర్ఎస్ నాయకులు తెల్లం భాస్కర్, టి. రాము, గడ్డం రమేష్, గంగాధర నగేష్, తదితరులు పాల్గొన్నారు.









