+91 95819 05907

ప్రభుత్వాసుపత్రికి విద్యుత్ కోసం పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) 15:- ప్రభుత్వ ఆసుపత్రికి 24 గంటల విద్యుత్ సౌకర్యం కోసం స్థానిక మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు రామాయంపేట మండల కేంద్రంలోని 33/11 కె.వి సబ్ స్టేషన్ నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు హెచ్డి లైన్ ఏర్పాటు కోసం కాంగ్రెస్ నాయకులు విద్యుదీకరణ పనులు చేపట్టారు.ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలు వేయడానికి కాంగ్రెస్ నాయకులు ముందస్తు చర్యలు తీసుకుంటుంటూ కొంతమంది విద్యుత్ స్తంభాలు వేయకుండా హెచ్డి లైన్ వేయకుండా అడ్డుపడుతుండగా కాంగ్రెస్ నాయకులు ముందుకు వచ్చి పోలీసుల సహాయంతో సమస్యను పరిష్కరించి ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చిన అభివృద్ధి పనులను ఆపేది లేదంటూ విద్యుదీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ విద్యుదీకరణ ఏర్పాటు కోసం సుమారుగా 10 లక్షల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు రోగుల ఆపరేషన్ల సౌకర్యార్థం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మూడు రోజుల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.అదేవిధంగా పట్టణంలోని రాజేంద్రనగర్ సాయిబాబా గుడి ప్రాంతంలో కూడ విద్యుకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.పట్టణంలో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !