నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సతీష్ కుమార్ జినుగు.
ఈ పార్ములా కేసు గురించి మాజీ మంత్రి కె టి ఆర్ ను ఏ సి బి విచారించారు. అనంతరం ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు, కొప్పుల, సింగిరెడ్డి తదితర ప్రముఖులతో మాజీ మంత్రి కె టి ఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు.
ఏసీబీ విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చుతూ, పెద్ద పెట్టున నినాదాలు చేశారు.మొదట మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు,ఆ తర్వాత కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర, శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి,మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్,మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్,కంచర్ల భూపాల్ రెడ్డి, నన్నపనేని నరేందర్,భాస్కర్ రావు తదితరులు ఉన్నారు.









